Posted by : Sainadh Reddy Sunday 8 September 2013


విదేశీ దిగుమతులపై ఆధారపడే ఏ దేశమైనా ప్రమాదంలో ఇరుక్కోవలసిందే అనడానికి మన దేశం మంచి ఉదాహరణ.ఎందుకంటే వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే విదేఅశ మారక ద్రవ్యం కావాలి అంటే డాలర్లు వుండి వుండాలి.అవి సంపాదించాలంటే మనము కూడా మన దేశ వస్తువులు ఎగుమతి చేస్తేనే డాలర్లు లభిస్తాయి.కాని మన స్వదేశీ పరిశ్రమలు ప్రోత్సాహం లేక మూతపడే స్థితిలో వున్నయి.కాబట్టి విదేశీ మారక ద్రవ్యం సంపాదించలేము.కాబట్టి సేవలను (సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు )ఎగుమతి చేయాలి.అయితే అభివృద్ధి చెందిన దేశాల నుండి గట్టి పోటిని ఎదుర్కొనవలసి వస్తుంది.అందువల్ల ఖనిజాలు ,ముడిసరుకులు, మానవ వనరులను ఎగుమతి చేయవలసి వస్తుంది.గతంలో ఆఫ్రికా దేశాలు బానిసలను ఎగుమతి చేసి దుస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలి.బానిసల వ్యాపారం అనాగరికం.విదేశీ మారక ద్రవ్యం కోసం ఎంతో మంది పేదవారు గల్ఫ్,అంగోలా,ఈజిప్ట్ వంటి దేశాల్లొ కడు దయనీయమైన బ్రతుకు సాగిస్తున్నారు.ఇంతచేసినా విదేశీ మారక ద్రవ్యం లభించటం లేదు.కాబట్టి ఎక్కువ అప్పు చేయటం,ప్రభుత్వమే కాక ప్రజలను, ప్రైవేట్ సంస్థలను విదేశీ అప్పులు తీసుకోవడానికి ప్రోత్సహించటం జరుగుతున్నది.విదేశీ పెట్టుబడులను రప్పించడానికి ప్రయత్నాలు ఎన్ని చేసినా డాలర్ డిమాండ్ పెరగటంతో,రూపాయి పతనం ఆపలేకపొతున్నారు.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -