Posted by : Sainadh Reddy Sunday 8 September 2013


ఒకసారి గాంధీ మరియు ఇర్విన్ ప్యాక్ట్ కి సంబంధించిన చర్చ ఆ ఇద్దరి మధ్య జరుగుతుంది. వైస్రాయి కోసం 'టీ' వచ్చింది.గాంధీజీ కోసం నిమ్మరసం తెచ్చారు.వైస్రాయి ఇదంతా చూస్తూ ఉన్నాడు.గాంధీజీ తన దగ్గర వున్న ఒక పొట్లం విప్పాడు.తెచ్చిన నిమ్మరసంలొ పొట్లం తెరిచి పొడిని ఆ నిమ్మరసంలో వేశాడు.వెంటనే వైస్రాయి అడిగాడు.'ఏమిటిదీ? అని.అప్పుడు గాంధీజి జవాబు చెపుతూ 'ఉప్పు పై మీరు వేసిన పన్నుకు వ్యతిరేకంగా,ఉప్పు సత్యాగ్రహం పేరుతో మీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ నేను తయారు చేసిన ఉప్పును నిమ్మ రసంలో వేసి త్రాగుతున్నానూఅని అంటాడు.ఇది గాంధీజీ అనుసరించిన స్వదేశీ ఉద్యమానికి ఉదాహరణ.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -