Posted by : Sainadh Reddy Thursday 29 August 2013

మీకు తెలుసా....
1947లొ అమెరికా నుండి లేదా మరే దేశము నుండైనా వస్తువులు కొంటే 1డాలర్ కి 1 రూపాయి చెల్లించే వాళ్ళం.కాని ఇప్పుడు 1డాలర్ విలువ గల వస్తువు కొంటె 60రూపాయిల 50పైసలు చెల్లించ వలసి వస్తుంది. అదే అమెరికా మన వద్ద నుండి 1 రూపాయి విలువ గల వస్తువు 1947లొ కొంటే 1 దాలర్ చెల్లించేది.ఇప్పుదు 60రూపాయల 50పైసల వస్తువులు కొన్నప్పటికి అదే 1 డాలర్ ఇస్తుంది. అప్పుడైన, ఇప్పుడైన మనకు లభించేది 1 డాలర్ మాత్రమే. అంటే దీనర్థం విదేశే వస్తువులు కొన్నా, మన వస్తువులు విదేశాలకు అమ్మినా మనకు ఆర్థికంగా నష్టమే నష్టం. ఈ నష్టం పూరించుకోవడానికి ఐఎం ఎఫ్ నుండి అప్పు తీసుకోవాల్సి వస్తుంది.మళ్ళీ రూపాయి పతనం తప్పదు. అప్పుడు మళ్ళీ అప్పు తప్పదు. రూపాయి పతనం తప్పదు. మీరు వూహించండి ..వేల కోట్ల రూపాయల విలువగల వస్తువులు దిగుమతులు జరుగుతున్న ఈ కాలంలొ ఎంత నస్టం జరుగుతున్నదో అర్థం చేసుకొండి.ఎగుమతులు జరిగినా లాభం ఏమీ లెదు. అలాగే భారత్ లోకి వస్తున్న విదేశీ కంపనీల లక్ష్యమేమిటంటే మన ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మన రూపాయి విలువ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.ఒక్క లాల్ బహదూర్ శాస్త్రిజి ప్రధాన మంత్రిగా వున్న కాలం లొ అంటే 18నెలల్లొ ఏ ఒక్క విదేశీ కంపనీ రాలెదు.అప్పుడు మాత్రమే స్వదేశీ విధానం అమలులో వుండేది.మురార్జీ దేశాయి ప్రధానిగా వున్నప్పుడు విదేశీ కంపనీలు రాకపోగా,అమెరికా కంపనీ కోకాకోలా కంపనీని బయటకు పంపించిన ఘనత ఆయనకు వుంది.అప్పుడు పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్ వుండెవాడు '

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -