Posted by : Sainadh Reddy Thursday 29 August 2013

1952లో మొదటిసారి మనదేశం విదేశాల నుండి అప్పు తెచ్చ్చింది. అంతకుముందు ఎవరినీ అప్పు అడగలేదు.మనకు అప్పు ఇచ్చే దేశాలు మనపై ఎన్నో షరతులు విధించారు.ఆ షరతుల్లో మొదటిది మనం ఏ కరెన్సీ లొ అప్పు తీసుకుంటామో ,ఆ కరెన్సీ విలువ పెరగాలి .అంటే డాలర్లలో అప్పు తీసుకుంటాం కాబట్టి డాలర్ విలువ పెరగాలి.. రూపాయి విలువ తగ్గాలి. దానికోసం 1952లొ అప్పు తీసుకునే ముందు రూపాయి విలువ 1డాలర్ కి 7రూపాయిలు చొప్పున తగ్గించి,అప్పు తీసుకున్నారు.1957లో మళ్ళీ అప్పు తీసుకున్నాం.ఆ తరువాత 62లొ,68లొ,72లొ,77లొ,82లొ అప్పు తీసుకుంటూ 82 నుండి ప్రతి సంవత్సరం అప్పు తీసుకోవటం మొదలుపెట్టాం.వెదీశాల నుండి తెచ్చిన అప్పును తీర్చడానికొసం మళ్ళీ మళ్ళీ అప్పు తీసుకునే ప్రధానులు వచ్చారు.దేశీ, విదేశీ అప్పు కలుపుకుని 36 లక్షల్ కోట్ల రూపాయల అప్పు వుంది.అంటే ప్రతి భారతీయుడి పైన 36000 రూపాయల అప్పు వుందన్నమాట.1డాలర్ విలువ 70 రూపాయలు కాబోతున్నది.ఏ దేశాలనుంది అప్పు తీసుకున్నామో ఆ దేశాల కంపనీలు మన దేశంలొ వచ్చి పెత్తనం చేయడానికి మన ప్రభుత్వాలే అనుమతిచ్చాయి.దాంతో మనం విదేశీ వస్తువులు కొంటూ వస్తున్నాం.అవి లాభాలు గడించి తమ దేశాలకు తరలిస్తున్నయి.దాంతో మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -