Posted by : Sainadh Reddy Saturday 7 September 2013


భారత దేశాన్ని ప్రేమించాలి అంటే అమెరికాను ద్వేషించాలని అర్థం కాదు కదా?స్వదేశీని పాటించాలి అంటే విదేశాలను వ్యతిరేకించమని కాదు అని అర్థం చేసుకోవాలి.రూపాయి విలువ పడిపోయి,మన దేశం విదేశీ ఆర్థిక పెత్తనంలో బానిసగా మారుతున్న సమయంలో మనం ఇకనైనా స్వావలంబనతో మెలగాలి.ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు తిండి,కూడు,గుడ్డ,నీళ్ళు,విద్యావకాశాలు ఇవన్నీ విదేశీయులు తయారు చేస్తే గాని మనకు దొరకవు అంటే ఎలా? అందుకే వాటిని తయారు చేసే ఉత్పత్తి సాధనాలు మన భారతీయుల చేతుల్లో వున్నప్పుడే మనం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినట్లు అవుతుంది.ఉదాహరణకు మన రైతులు సీజన్లో పొలం పనులు చేస్తూ,సీజన్ లేని సమయంలో రైతులకు చిన్న,గ్రామీణ,కుటీర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నడిపించడంలొ శిక్షణ ఇస్తే,గ్రామాల నుండి వలసలు ఆగిపొయి,వూర్లో వున్నవాళ్ళకు ఉపాధి లభిస్తుంది.ప్రపంచ ప్రఖ్యాతి గడించిన స్విస్ గడియారాలు కుటీర పరిశ్రమల్లోనే తయారు అవుతుంటాయని ఎందరికి తెలుసు?ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ వంటి విదేశీ యూనివర్సిటీలలో చదువుకుని మన దేశాన్ని ఏలుతున్న మన పాలకులకు మన గ్రామీణ పేద ప్రజల అవసరాలు ఎలా అర్థమవుతాయి.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -