Posted by : Sainadh Reddy Saturday 7 September 2013


మళ్ళీ పదవులకు వస్తామో,రామోనన్న ఆలోచనతో,రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించిన డబ్బును ఆయా దేశాల్లొ దాచి వుంచారు.గత కొద్ది నెలలుగా ఆ డబ్బును పెద్ద మొత్తం హవాలా రూపంలో తీసుకొనివస్తుండటంతో,రూపాయలు పెరిగి,డాలర్ల సప్లై తగ్గింది.దాంతో రూపాయి పతనం మొదలైంది.ప్రస్తుతం మన నాయకులు విదేశీ బ్యాంకుల్లొ దాచిన మొత్తం విలువ ఒకటిన్నర ట్రిలియన్ డాలర్లు.అంటే మన కరెన్సీలో 105లక్షల కోట్ల రూపాయలు.ఆ మొత్తాన్ని నేరుగా తెస్తే 4లక్షల కోట్లకు పైగా పన్ను పడుతుందని,హవాలా మార్గంలో తెస్తుంటారు.అంతే కాదు మారిషష్ దేశం లో కంపనీని ప్రారంభించినట్లు పేపర్లో సృష్టించి,ఒక ఆఫిసును తెరుస్తారు.(ఎందుకంటే ఆ దేశంలో టాక్స్ లేదు).అప్పుడు ఆ కంపనీ పేరుతో మన దేశం స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడి రూపంలో డబ్బును తెస్తున్నారు.అక్కడ పెట్టినందుకు వడ్డీ ఇవ్వకపోగా,దాచినందుకు 2శాతం సర్వీస్ టాక్స్ వేస్తారు.ఆ బ్యాంకులు ఆ మొత్తాన్ని వేరేచోట డిపాజిట్ చేసి,4శాతం వడ్డిని పొందుతాయి.అంతేకాకుండా రెండవది,ఎగుమతులు తగ్గి,దిగుమతులు పెరిగి,కరెంట్ అకౌంట్ లోటు పెరిగి,రూపాయి విలువ పడిపొయింది.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -