Posted by : Sainadh Reddy Thursday 29 August 2013


మన ప్రభుత్వం చైనాకు అపరిమితమైన్ వాణిజ్య సదుపాయాలు కల్పించటంలొ,ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నది.దాంతో చైనా వస్తువులు కుప్పలు తెప్పలుగా మన మార్కెట్లను ముంచెత్తుతున్నాయి.40శాతం గ్రామీణ,చిన్న తరహా పరిశ్రమలు చైనాతో పొటీపడలేక మూతపడుతున్నాయి.84బిలియన్ డాలర్ల విలువగల చైనా ఉత్పత్తులు మన దేశంలొకి దిగుమతి అవుతున్నాయి.చైనా మన దేశం నుండి తక్కువ ధరకు ముడిసరుకుని తీసుకుని పోయి, మళ్ళీ మన దేశంలోనే తక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నదిి.మన దేశంలో 3లక్షల కోట్ల విలువగల వస్తువులు అమ్ముడుపోతుంటే,చైనా ఖజానాకు 12శాతం టాక్స్,అంటే 40వేల కోట్ల రూపాయలు చేరుతున్నాయి.తక్కువ ధరకు లభిస్తున్నాయన్న ఆశతొ,చైనా వస్తు వ్యామోహంతో మన భారతీయులే అధిక మొత్తాన్ని చైనాకు కట్టబెడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.టాక్సన్ కంపనీకి చెందిన క్యాలిక్యులేటర్లు,టి సి ఎల్ కి చెందిన టి వీలు,ఇనోవాకు చెందిన కంప్యూటర్లు అలాగె ఇతర బ్రాండ్లకు చెందిన బొమ్మలు,పెన్నులు, బల్బులు,జనరేటర్లు,పాలు,గుడ్లు,పిన్నీసులు,కర్చీఫులు,మొబైల్ ఫోన్లు మొదలైనవి మన మార్కెట్లలో పెత్తనం చేస్తున్నవి.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -