- Back to Home »
- Articles »
- రూపాయి పతనం-11
Posted by : Sainadh Reddy
Sunday, 8 September 2013
రూపాయి విలువ పడిపోయింది కాబట్టి దాని ఫలితాలు రుచి చూడవలసిందే కదా.వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.ద్రవ్యోల్బణం పెరిగింది.వాణిజ్య లోటు,డ్రవ్య లోటు,బడ్జెటు లోటు,రెవెన్యూ లోటు పెరిగి,ఖర్చులు పెరిగాయి.మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.ఉత్పత్తి తగ్గిపోయింది.వస్తువుల వినియోగం పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే 1991 నాటి పూర్వ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.స్వాతంత్ర్యం తరువాత మన స్వదేశీ ఉత్పత్తి రంగాన్ని పట్టించుకోని కారణంగా,విదెశీ విధానాలు మన కొంప ముంచాయి.వంద కోట్ల జనాభా వున్నా కూడా ఒక నలుగురి ఆర్థిక వేత్తలనబడే మన్మొహన్ సింగ్ ,చిదంబరం,ప్రణబ్ ముఖర్జీ మరియు మోంటెక్ సింగ్ ఆహ్లూవాలియా వంటి వాళ్ళపై దేశ ఆర్థిక వ్యవస్థను వుంచేసి మనం చేతులు దులుపుకోవలసిందేనా?